వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజాద్‌కు ఝలక్: ఇప్పుడే చెప్పలేనని కెకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జు గులాం నబీ ఆజాద్‌కు రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు మంగళవారం ఝలక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసిన అనంతరం అధిష్టానం వారిని పలుమార్లు ఢిల్లీకి రమ్మని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే వారు తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం అధిష్టానం నుండి వచ్చే వరకు ఢిల్లీ వెళ్లేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. వారిని ఢిల్లీ పంపించేందుకు రాష్ట్ర నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అయితే ఆజాద్ మంగళవారం టి-కాంగ్రెసుకు నేతృత్వం వహిస్తున్న కె కేశవరావుకు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. కెకెకు ఫోన్ చేసి తెలంగాణపై, రాజీనామాలపై చర్చించేందుకు ఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానించాడు. అందుకు కేశవరావు తాము ఢిల్లీ వస్తామని ఇప్పుడే మాట ఇవ్వలేమని, స్టీరింగ్ కమిటీలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు అధిష్టానం చుట్టూ తిరిగిన తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధుల నుండి ఇలాంటి సమాధానాలు, వారిలో ఇలాంటి పట్టుదల ఉందని ఆజాద్ ఊహించి ఉండడు.

English summary
Union Minister Ghulam Nabi Azad shocked by Rajya Saba member K Keshav Rao today. Azad phoned to KK on Delhi tour. He told him that he will decide in stearing committe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X