పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలు మారేవారు 14 శాతం
ఆకర్షణీయమైన పే ప్యాకేజీలు (21) శాతం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు (16) శాతం, పై అధికారులతో అసంతృప్తి (15) శాతం, పని ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలు మారేవారు (14) శాతంగా ఉన్నారని కుమార్ వివరించారు. ఉద్యోగుల్లో 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారిలో వలసలు 39 శాతం కాగా. 5-10 ఏళ్ల అనుభవం ఉన్నవారిలో 27 శాం మంది.. 10-15 శాతం అనుభవం ఉన్నవారిలో 22 శాతం మంది ఉన్నట్లు సర్వేలో తేటతెల్లమయింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 15 ఏళ్లు ఆపైన అనుభవం ఉన్నవారు మాత్రం వలసలకు చాలా తక్కువగా 15 శాతం ఉంటున్నాయి.
కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఏంట్రీలెవెల్ యువకులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించి తమ కోరికలను తీర్చుకోవాలని జీవితంలో తొందరగా స్థిరపడాలని కోరుకుంటున్నారు. ఒక వేళ వారు అదే ఉద్యోగంలో కొనసాగితే వారి వేతనం 10-20 శాతం వరకు మాత్రం పెరిగే అవకాశం ఉంది. అదే కొత్త ఉద్యోగంలోకి చేరితే వారి వేతనాలు 25-40 శాతం వరకు పెరుగుతుంది. ఉద్యోగులు పెద్ద ఎత్తున వలసలు వెళ్లటం వల్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో కొత్తగా మళ్లీ ఉద్యోగులను తీసుకోవడం వల్ల వారికి హెచ్చు జీతాలు చెల్లించి తీసుకోవాల్సివస్తోంది. హై హైరింగ్ క్లబ్ ఈ సర్వేను ఆసియా, గల్ఫ్/మధ్యప్రాచ్య దేశాల్లో నిర్వహించింది. మొత్తం 18,000 మంది ఉద్యోగులు 249 మంది యజమానులను ఈ ఏడాది మే జూన్ నెలలో సర్వే నిర్వహించింది.
భారత్లో ఉద్యోగుల వలసలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కూడా ఉద్యోగుల వలసలు ఎక్కువగానే ఉన్నాయని దీనికి ప్రధాన కారణం నిపుణులైన ఉద్యోగులకు పెద్ద ఎత్తున వేతనాలు ఇచ్చి ఆకర్షిస్తున్నాయి. దీంతో కంపెనీలు మళ్లీ కొత్త ఉద్యోగుల వేట ప్రారంభించాల్సి వస్తోంది. వలసలకు వేతనాలు ఒక కారణమైతే... మరో కారణం ప్రమోషన్లు కూడా కారణమని మై హైరింగ్ క్లబ్ డాట్కామ్ సీఈవో రాజేష్కుమార్ చెప్పారు.