గడ్కరీ కుమారుడి కంపెనీలో ఐటి శాఖ దాడులు

Nitin Gadkari
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు నితన్ గడ్కరీ కుమారుడు నిఖిల్ గడ్కరీకి చెందిన కార్యాలయంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీలో నిఖిల్ గడ్కరీ ప్రధాన వాటాదారుడు. గుజరాత్‌కు చెందిన కంపెనీలో ఇటీవల ఐటి దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ గడ్కరీకి ప్రధాన వాటాదారుడైన నాగపూర్‌కు చెందిన అంకుర్ సీడ్స్‌ నుంచి ఆ కంపెనీకి పెద్ద యెత్తున పెట్టుబడులు వచ్చాయి.

నిఖిల్ గడ్కరీకి చెందిన కంపెనీలో ఐటి శాఖ సోదాలు చేసిన విషయంపై బిజెపి నాయకులు మౌనం పాటిస్తున్నారు. ఇప్పుడు దానిపై తాము ఏమీ మాట్లాడదలుచుకోలేదని, మామూలుగా జరిగే వ్యవహారంలో భాగంగానే ఈ దాడులు జరిగి ఉంటాయని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+