వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్యాంకుబండులో సూసైడ్ చేసుకోవాలి: కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వరంగల్ జిల్లా పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ తెలంగాణ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులపై ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కాంగ్రెసు పార్టీ నేతలకు చిత్తశుద్ది ఉంటే మరోసారి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలకు వెనకాడితే ప్రజల్లో తిరిగలేరని వారిని హెచ్చరించారు. వారు వెంటనే మళ్లీ తమ రాజీనామాలు ఇవ్వాలన్నారు.

తెలంగాణలో విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలు ఆగాలంటే తెలంగాణ కోసం రాజీనామాలు సమర్పించిన ప్రజాప్రతినిధులు అందరూ తమ తమ రాజీనామాలు ఆమోదింప జేసుకోవాలని అన్నారు. లేదంటే వారు ట్యాంకుబండులో దూకి సూసైడ్ చేసుకోవాలన్నారు. కాగా ఆదివారం మధ్యాహ్నం ఆమె తన రాజీనామా లేఖతో అసెంబ్లీకి వచ్చారు. అయితే అసెంబ్లీ సెక్రటరీ లేక పోవడంతో అమె వెనుదిరిగి వెళ్లి పోయారు. సోమవారం తన రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు.

English summary
YSR Congress party president YS Jaganmohan Reddy camp Congress mla Konda Surekha lashes out Telangana Congress leaders today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X