నిజాం అడిగితే ఇచ్చేస్తారా?: ఆనం వివేకానంద

సంవత్సరం క్రితం లేని మనోభావాలు తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అవి ఎలా వచ్చాయో అందరికీ తెలుసునన్నారు. సమైక్య వాదాన్ని కోరుతున్న తమ వాదన సరియైనది అన్నారు. గ్రేటర్ రాయలసీమకు తాను పూర్తి వ్యతిరేకం అన్నారు. అందుకు అంగీకరించేది లేదన్నారు. ప్రజల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమ, ఆంధ్రా ప్రజలు అందరూ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారని అన్నారు. తమకు సమైక్యాంధ్ర తప్ప ఏదీ వద్దన్నారు. రాష్ట్రం పెద్దగా, భాషా ప్రయుక్తాలుగా ఉంటే అభివృద్ధి చెందుతుందన్నారు.












Click it and Unblock the Notifications