విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోహన్ నా భార్యను వేధిస్తేనే మోహన్‌ను చంపా

By Srinivas
|
Google Oneindia TeluguNews

TNSF
విజయవాడ: నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ అనుచరుడు, టిఎన్ఎస్ఎఫ్ నేత వడ్లమూడి మోహన్ నుండి తన భార్యకు నిత్యం అక్రమ సంబంధం కోసం వేధింపులు వచ్చినందునే చంపేశానని మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు నాగరాజు గురువారం పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. తన భార్యను నిత్యం అక్రమ సంబంధం కోసం మోహన్ వేధించే వాడని చెప్పాడు. మోహన్ తీరు శృతి మించడంతో హత్య చేశామని ఒప్పుకున్నాడు. మోహన్‌ను చంపి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేసినట్టు సైతం ఒప్పుకున్నాడు.

కాగా టిఎన్ఎస్ఎఫ్ నేత మోహన్ రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లిఫ్ట్ అడిగి ఆయనను దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే. దానిని నిందితులు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. పోస్టు మార్టం చేసే వరకు నాగరాజుతో సహా నిందితులు అందరూ విజయవాడలోనే ఉన్నప్పటికీ మోహన్‌ది హత్య అనే అనుమానాలు రావడంతో వారు నగరాన్ని వదిలి వెళ్లారు. వారు కొన్ని రోజులు హైదరాబాదులోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నారు. బుధవారం రాత్రి హైదరాబాదు నుండి విజయవాడకు వెళ్లేందుకు భద్రాచలంలో ఆగారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీసులు నిందితులను గుర్తించి భద్రాచలంలో నాగరాజు, ఆయన భార్య నళినితో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

English summary
Nagaraju agreed his wrong in TNSF leaders Vadlamudi Mohan murder case today in police enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X