మోహన్ హత్య కేసు, నళిని సహా 8 మంది అరెస్టు
అయితే ఫోన్ కాల్స్ ఆధారంగా భద్రాచలం చేరుకున్న వారిని విజయవాడ నుండి రెండు పోలీసు ప్రత్యేక బృందాలు వెళ్లి అదుపులోకి తీసుకున్నాయి. కాగా మోహన్ హత్య కేసులో మొత్తం పదిహేను మంది నిందితులను పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే నిందితులు అందరూ మోహన్కు పోస్టుమార్టం జరిగే సమయం వరకు విజయవాడలోనే ఉన్నారు. ప్రమాదంలో చనిపోయారని అందరూ భావించిన నేపథ్యంలో వారు అక్కడే ఉన్నారు. అయితే పోస్టుమార్టం అనంతరం అది హత్యగా తేలడంతో వారు విజయవాడ ఖాళీ చేసినట్లుగా తెలుస్తోంది. మోహన్ హత్య కేసులో నాగరాజు ప్రధాన నిందితుడు కావడంతో పోలీసులు అతనిపై గతంలో ఉన్న రౌడీషీట్ తిరిగి ఓపెన్ చేశారు.
English summary
Vijayawada police arrest eight accused in Vadlammudi Mohan's murder case yesterday night at Bhadrachalam.
Story first published: Thursday, July 28, 2011, 10:10 [IST]