రాయపాటి, లగడపాటి ఖల్ నాయక్‌లు: హరీష్ రావు

Harish Rao
ఆదిలాబాద్: కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌లను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు హరీష్ రావు ఖల్ నాయక్‌ల్లా అభివర్ణించారు. వారివి చీకటి వ్యాపారాలని ఆయన ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో వివిధ పార్టీల నాయకులు తెరాసలో చేరిన సందర్భంగా ఆయన శనివారం ప్రసంగించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు భూకబ్జాలకు, అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

సీమాంధ్ర నాయకులకు మానవత్వం కూడా లేదని, తెలంగాణలో 600 మంది విద్యార్థులు మరణిస్తే మాట్లాడడం లేదని ఆయన అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ మృతికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం కూడా ప్రకటించలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలుసునని ఆయన అన్నారు. సైన్స్ సిటీని, గిరిజన విశ్వవిద్యాలయాన్ని సీమాంధ్రలో పెడుతున్నారని, తెలంగాణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పురంధేశ్వరి వాటిని సీమాంధ్రకు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించారని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+