సిఎం అవుతాననుకోలేదు: యడ్యూరప్ప భావోద్వేగం

దేశంలో ఇనుప ఖనిజ రవాణా రద్దు చేసిన ప్రభుత్వం తమదే అని అన్నారు. గనుల అక్రమాలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగుకు తాను లేఖ సైతం రాశానని చెప్పారు. రాష్ట్రంలో అవినీతిని అరికట్టడానికి చిత్తశుద్ధితో పని చేశానని అన్నారు. ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి రాజీనామాను సమర్పించానని, సాయంత్రం గవర్నర్ భరద్వాజ్ను కలిసి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు.
కర్నాటక ప్రజలు తనను అభిమానంతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టారన్నారు. ప్రజలు చూపించిన అభిమానంతో సంతోషంగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్కు రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. పదవి కోల్పోయినందుకు తాను బాధపడటం లేదన్నారు. ప్రజల్లోకి వెళ్లే అవకాశం వచ్చినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. పదవికి రాజీనామా చేయడం ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు తనకు మంచి అవకాశం వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications