దద్ధరిల్లిన పార్లమెంటు ఉభయ సభలు, వాయిదా

Parliament
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, భూ సేకరణ బిల్లు అంశాలపై మంగళవారం పార్లమెంటు ఉభయసభలు దద్ధరిల్లాయి. ఉభయసభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. తిరిగి రెండు గంటలకు సమావేశమైన తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం లోకసభ సమావేశం కాగానే ఇద్దరు సభ్యుల మృతికి సంతాపం ప్రకటించిన వెంటనే బిఎస్‌పి సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ లోకసభ వెల్‌లోకి దూసుకెళ్లారు. రైతులకు ఊరట కలిగించడానికి భూసేకరణ బిల్లును వెంటనే ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు.

భూసేకరణ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు కూడా ఉత్తరప్రదేశ్ బిఎస్‌పి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. కొంత మంది ఎస్పీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దని స్పీకర్ మీరా కుమార్ సూచించినా సభ్యులు వినలేదు. తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో సభను ఆమె రెండు గంటల వరకు వాయిదా వేశారు . ఆ తర్వాత రేపటికి వాయిదా పడింది.

రాజ్యసభలో ధరల పెరుగుదలపై బిజెపి సభ్యులు ఆందోళనకు దిగారు. అన్నాడియంకె సభ్యుడు ఎ విలియం రబీ బెర్నార్డ్ ప్రమాణం చేసిన వెంటనే బిజెపి సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు లేచి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ధరల పెరుగుదలపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. తాము ఇచ్చిన నోటీసు ఏమైందని ఆయన అడిగారు. నోటీసును అనుమతించలేదని చైర్మన్ హమీద్ అన్సారీ చెప్పారు. దీంతో బిజెపి సభ్యులు చర్చకు పట్టుబట్టారు. భూ సేకరణ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఇతర పార్టీల సభ్యులు కూడా లేచి నించున్నారు. తగిన సమయంలో అన్ని విషయాలపై చర్చిద్దామని అన్సారీ చెప్పినా సభ్యులు వినలేదు. బిజెపి సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభను అన్సారీ రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత రేపటి వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+