రామోజీ రావుపై దుమ్మెత్తిపోసిన జగన్ సాక్షి డైలీ
తమకు దీటుగా నిలబడి, వారి గట్టు రట్టు చేస్తున్నందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం సాగుతోందని సాక్షి వార్తాకథనం ముఖ్య సారాంశం. వైయస్ను చెరిపేయడానికి కాంగ్రెసు నాయకులు చంద్రబాబుతో జత కట్టారని విమర్శించింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉటంకిస్తూ ప్రభుత్వం వాటిని అమలు చేయలేని స్థితిలో ఉందని విమర్శించింది. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టబద్దం కాని లబ్ధి చేకూర్చడం వల్లనే, వారికి ఎన్నో ప్రత్యేక మినహాయింపులు ఇచ్చినందువల్లనే, అందుకు ప్రతిఫలంగా సాక్షిలో వారు పెట్టుబడులు పెట్టారని వాదిస్తున్నారని, ఈ వాదన చేస్తున్న వ్యక్తులు మొదట నిరూపించాల్సింది వైయస్ నేతృత్వంలోని మంత్రి మండలి, అందులోనూ ప్రత్యేకంగా వైయస్ ఇలా రూల్ బుక్ను ఉల్లంఘించి ఏ పారిశ్రామిక సంస్థకైనా ప్రత్యేక ప్రయోజనం కలిగించారా అన్నది అంటూ చంద్రబాబు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలుచేసింది.