హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖేష్ గౌడ్ పిఎ భార్య అనుమానాస్పద మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: మంత్రి ముఖేష్ గౌడ్ పిఎ అమరేందర్ రెడ్డి భార్య మమత అనుమానాస్పదంగా మృతి చెందింది. గత కొన్నాళ్లుగా ముఖేష్ గౌడ్ వద్ద పిఏగా పని చేస్తున్న అమరేందర్ రెడ్డికి మమతతో ఎనిమిది నెలల క్రితం పెళ్లయింది. వీరు ఉప్పల్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉంటున్నారు. బుధవారం రాత్రి అమరేందర్ రెడ్డి తన భార్య తండ్రికి ఫోన్ చేసి మమతకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఉస్మానియా హాస్పిటల్‌లో చేర్పించానని ఫోన్ చేసి చెప్పారు. అయితే వారు హాస్పిటల్ చేరుకునే సరికి ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దాంతో వారు అమరేందర్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమరేందర్ అప్పుడప్పుడు తాగి వచ్చి కొట్టే వాడని ఆరోపిస్తున్నారు.

మమతకు ఆరోగ్యం బాగా లేకపోతే తమకు ఫోన్ చేయకుండానే ఆసుపత్రికి తరలించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వారు మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో అమరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మరికొద్దిసేపట్లో మమత మృతదేహానికి పోస్టు మార్టం చేస్తారు. పోస్టుమార్టం రిపోర్టులో దెబ్బలు ఉన్నట్లు తేలితే అమరేందర్ రెడ్డి పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది.

English summary
Minister Mukesh Goud PA Amarender Reddy's wife Mamatha dead in suspicious circumstances yesterday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X