వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సదానంద ప్రమాణానికి 55 మంది రెబల్స్ డుమ్మా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sadananda Gowda
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్నప్పటికీ రాజకీయ సంక్షోభం తొలగిపోలేదు. రాజకీయ సంక్షోభం ఇప్పట్లో తొలిగే పరిస్థితి కూడా లేదు. గురువారం జరిగే సదానంద గౌడ ప్రమాణ స్వీకారానికి 55 మంది తిరుగుబాటు శాసనసభ్యులు గైర్హాజరయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

బుధవారం జరిగిన రహస్య బ్యాలెట్‌లో గౌడ జగదీష్ షెట్టర్‌పై గెలుపు సాధించారు. తద్వారా ఆయన బిజెఎల్‌పి నేతగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో షెట్టర్‌కు మద్దతిచ్చిన 55 మంది శాసనసభ్యులు సదానంద గౌడకు సహకారం అందించే విషయంపై అనుమానాలు చెలరేగుతున్నాయి.

తనకు మద్దతు ఇచ్చిన 55 మంది శాసనసభ్యులను షెట్టర్ అల్పాహార విందుకు ఆహ్వానించారు. వారంతా ఈ అల్పాహార విందు సమావేశానికి హాజరవుతారని అంటున్నారు. తన మద్దతుదారులను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బెదిరించారని ఎన్నికలో ఓటమి పాలైన తర్వాత షెట్టర్ ఆరోపించారు. యడ్యూరప్ప సదానంద గౌడకు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. మీకెవరు ఓటేశారో తనకు తెలుసునని, వారితో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసునని యడ్యూరప్ప అన్నారని షెట్టర్ ఆరోపించారు.

English summary
The Bharatiya Janata Party (BJP) has already elected Sadananda Gowda as the new Karnataka Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X