వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై నా వైఖరి అదే: బొత్స సత్తిబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తన వైఖరి మారలేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం గాంధీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. తెలంగాణపై పిసిసి అధ్యక్షుడిగా కాకముందు చెప్పిన వ్యాఖ్యలకే తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇప్పటి వరకు తన వైఖరి మారలేదని, ఇక ముందు కూడా మారబోదన్నారు. అయితే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం బాగా లేనందున ఉద్యమానికి కాస్త విరామం ఇవ్వాలని ఆయన కోరారు.

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవియే పార్టీ విలీనంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పంట విరామం ప్రకటిస్తున్న రైతులతో ప్రభుత్వం చర్చిస్తుందని అన్నారు. వారి సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలుస్తామని అన్నారు. కాగా ఈ నెల 21, 22వ తారీఖుల్లో తూర్పు గోదావరి జిల్లాలో బొత్స సత్యనారాయణ పర్యటిస్తారు.

English summary
PCC chief Botsa Satyanarayana said today that his stand is not changed on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X