హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై చంద్రబాబు రాజనీతి చూపాలి: నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలంగాణపై తన రాజనీతిని ప్రదర్శించాలని ఆ పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి శుక్రవారం అన్నారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు మరోసారి చిదంబరానికి లేఖ రాసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ప్రతి చిన్న విషయానికి స్పందించే చంద్రబాబు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షకు ఎందుకు స్పందించడం లేదని అన్నారు. తెలంగాణపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణ అంశాన్ని టిడిపి పైకి నెడుతున్నప్పటికీ చంద్రబాబులో చలనం కలగకపోతే ఘోర అవమానమే అన్నారు.

కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో లేఖ పోవడం విచారకరమన్నారు. తెలంగాణ ఆత్మ బలిదానాల గురించి మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఉద్యమం ఆపాలని చెప్పడం ఎంత వరకు సమంజసం అన్నారు. చిదంబరం తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఒక్క సీటు లేని బిజెపి తెలంగాణపై చర్చిస్తుంటే టిడిపి మౌనం వహించడం ఏమిటమన్నారు.

English summary
TDP suspended MLA Nagam Janardhan Reddy demanded today TDP chief Chandrababu Naidu stand on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X