'తుపాకీ పట్టుకొని చర్చలంటే ఎలా, ఆ మంత్రులేరి? '

తెలంగాణ కేంద్ర పరిధిలో ఉన్నదని చెబుతున్న ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న 14ఎఫ్ రద్దు, ఎస్మా ప్రయోగాలపై నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రశాంత వాతావరణం కల్పించాకే చర్చలకు వస్తామని మంత్రులకు చెప్పామని అన్నారు. చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడాలంటే అన్ని శాఖలలో ఉన్న పారామిలటరీ దళాలను వెనక్కి పిలవడం, ఎస్మా ప్రయోగాన్ని ఉపసంహరించుకోవడం - ఈ రెండు ప్రభుత్వం చేస్తేనే తాము చర్చలకు వస్తామని చెప్పామని అన్నారు. ప్రభుత్వం వెంటనే 166, 177 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తమ చర్చల్లో తెలంగాణ ప్రాంత మంత్రులు లేక పోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన శ్రీధర్ బాబు, బస్వరాజు సారయ్య లేరని అన్నారు. సమైక్య వాదులు అయిన ముగ్గురు సీమాంధ్ర మంత్రులతో పాటు తెలంగాణ కోసం రాజీనామా చేయని ఇద్దరు మంత్రులు ఉన్నారని అలాంటప్పుడు తమకు అనుకూలంగా ఎక్కడ ఉంటుందని వారు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications