హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

13 నుంచి 48 గంటల తెలంగాణ బంద్: ఒయు జెఎసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Bandh
హైదరాబాద్‌: 14ఎఫ్‌ను తొలగిస్తూ ఈ నెల 12వ తేదీ లోగా నిర్ణయం ప్రకటించకపోతే ఈ నెల 13, 14 తెదీల్లో తెలంగాణ బంద్ నిర్వహించనున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (ఒయుజెఎసి) హెచ్చరించింది. సకలజనుల సమ్మెకు మద్దతుగా ఉస్మానియా యూనివర్శిటీలో తెలంగాణ, ఓయూ ఐకాసలు శనివారం పోస్టర్‌ను ఆవిష్కరించాయి. తమ ఆందోళనా కార్యక్రమాలను ఒయు జెఎసి నాయకులు ప్రకటించారు.

ఆగస్టు 8 నుంచి 17 వరకు కాలేజీ బాట నిర్వహిస్తామని ఒయు జెఎసి నాయకులు తెలిపారు. ఆగస్టు 12లోపు 14ఎఫ్‌ తొలగించకుంటే 13వ తేదీ నుంచి 48గంటల తెలంగాణ బంద్‌ పాటిస్తామని వారు తెలిపారు. సకలజనుల సమ్మెకు మద్దతుగా ఆగస్టు 17న తరగతుల బహిష్కరణ, విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణలో అదనపు బలగాలు తొలగించాలని ఈనెల 16న జాతీయ రహదారులను దిగ్భంధిస్తామని వారు తెలియజేశారు.

English summary
OU JAC leaders said that they give call for 48 hours telangana bandh, if 14F is not cleared till August 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X