విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణా జిల్లాలో 15 నుంచి జగన్ ఓదార్పు యాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లాలో ఇటీవలే ఆయన ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఓదార్పు యాత్ర చేపట్టాలని అనుకుంటున్నప్పటికీ తెలంగాణ వేడి కొనసాగుతుండడంతో వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు 16 రోజుల ఓదార్పు యాత్ర సాగుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

వైయస్సార్ మరణవార్తను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న 60 మంది కుటుంబాలను జగన్ పరామర్సిస్తారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జగన్ 1150 కిలోమీటర్లు ప్రయాణిస్తారని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర ముగింపు సందర్భంగా విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఆయన చెప్పారు.

English summary
YSR Congress party president YS Jagan to takeup Odarpu Yatra in Krishna district from August 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X