నేతాజి పద్మనాభుని ఆలయంలో తలదాచుకున్నారా..??

పద్మనాభుని ఆలయంలో నేతాజి మారువేషంలో తలదాచుకున్నాడనే అనుమానాలు వ్యక్త మవటంతో బ్రిటీష్ అధికారులు ఆలయ ప్రాంగణంలో నిఘా ఉంచినట్లు బయటపడిన లేఖ ద్వారా తెలుస్తోంది. సుభాష్ చంద్రబోస్ పద్మనాభస్వామి ఆలయంలో ఉన్నట్లు 1941లో ఓ గుర్తు తెలియని వ్యక్తి కోల్కతాలోని బ్రిటీష్ అధికారులకు లేఖ రాశారు.
వారు ఆ లేఖను అప్పటి మద్రాస్ స్టేట్ రెసిడెంట్ లెఫ్టినెంట్ కల్నల్ జి..పి.మర్ఫీకి పంపించారు. మర్ఫీ ఈ లేఖను ట్రావెన్ కోర్ దివాన్ సర్ సి.పి.రామస్వామి అయ్యర్కు పంపించారు. ఆలయంలో అనుమానస్పద వ్యక్తులు కదలికల పై నిఘా పెట్టాలని సూచించారు. కానీ, ఆలయ ప్రాంగణంలో బోస్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదు.












Click it and Unblock the Notifications