వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేతాజి పద్మనాభుని ఆలయంలో తలదాచుకున్నారా..??
పద్మనాభుని ఆలయంలో నేతాజి మారువేషంలో తలదాచుకున్నాడనే అనుమానాలు వ్యక్త మవటంతో బ్రిటీష్ అధికారులు ఆలయ ప్రాంగణంలో నిఘా ఉంచినట్లు బయటపడిన లేఖ ద్వారా తెలుస్తోంది. సుభాష్ చంద్రబోస్ పద్మనాభస్వామి ఆలయంలో ఉన్నట్లు 1941లో ఓ గుర్తు తెలియని వ్యక్తి కోల్కతాలోని బ్రిటీష్ అధికారులకు లేఖ రాశారు.
వారు ఆ లేఖను అప్పటి మద్రాస్ స్టేట్ రెసిడెంట్ లెఫ్టినెంట్ కల్నల్ జి..పి.మర్ఫీకి పంపించారు. మర్ఫీ ఈ లేఖను ట్రావెన్ కోర్ దివాన్ సర్ సి.పి.రామస్వామి అయ్యర్కు పంపించారు. ఆలయంలో అనుమానస్పద వ్యక్తులు కదలికల పై నిఘా పెట్టాలని సూచించారు. కానీ, ఆలయ ప్రాంగణంలో బోస్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదు.
Comments
English summary
The Sree Padmanabhaswamy temple here, now in the limelight for the huge treasures discovered in its vaults, was once closely monitored at the behest of the British rulers who suspected freedom fighter Subhas Chandra Bose lived there secretly for a while, according to a little known archival record.
Story first published: Monday, August 8, 2011, 10:03 [IST]