హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా గాంధీ లేకున్నా విలీనానికి చిరంజీవి ఓకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ లేక పోయినప్పటికీ తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయడానికి చిరంజీవి సన్నాహాలు చేస్తున్నారు. సోనియా గాంధీ చికిత్స కోసం అమెరికా వెళ్లే ముందు ఏర్పాటు చేసిన కోర్ కమిటీ నేడో రేపో విలీనం తేదీని ప్రకటించనుందని సమాచారం. ఆ కోర్ కమిటీలో సోనియా తనయుడు రాహుల్ గాంధీ, సోనియాకు సన్నిహితులు ఉండటంతో విలీనానికి చిరు సై అన్నట్లుగా తెలుస్తోంది. సోనియా అనారోగ్యం కారణంగా విలీనం ఆలస్యమయింది. సోనియా రావడానికి మరో రెండు మూడు వారాలు అవుతుంది. కాబట్టి ఆలస్యం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే మరో రెండు మూడు రోజుల్లో విలీనం పూర్తి చేయాలని ఇటు చిరు, అటు కాంగ్రెసు భావిస్తోంది.

చిరు త్వరలో కోర్ కమిటీ సమక్షంలో కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 6 నుండి 10వ తేది మధ్య వీలు చూసుకొని ఢిల్లీ వచ్చి కాంగ్రెసు సభ్యత్వం తీసుకోవాలని వారం రోజుల క్రితం సోనియా నుండి చిరుకు పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె అనారోగ్యం కారణంగా చిరు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఇదే విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం సోమవారం చెప్పారు. కోర్ కమిటీ సభ్యులతో పిఆర్పీ విలీనంపై చర్చించానని విలేకరులతో చెప్పారు. ఇప్పటికే విలీనం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ సోనియా ఆనారోగ్యం కారణంగా ఆలస్యమైందని చెప్పారు. చిరు విలీనానికి ఓకే అన్నారని చెప్పారు. కాగా క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా మంగళవారం గాంధీ భవనంలో జాతీయ జెండా పతాకాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.

English summary
PRP president Chiranjeevi Okayed his party merger in Congress in absence of AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X