వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్యలకు నేతలే కారణం: ఆనం వివేకానంద రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Vivekananda Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులే కారణం అని అన్నారు. విద్యార్థుల శవాల మీద సౌధాలు నిర్మించుకోవాలని తెలంగాణ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పిల్లలను విదేశాల్లో చదివిస్తూ సామాన్య విద్యార్థులను మాత్రం ఉద్యమం పేరుట బలి చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను, యువతను రెచ్చగొడుతున్న తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాంను ప్రభుత్వ ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని నక్సల్స్, రాడికల్స్ నడిపిస్తున్నారని ఆరోపించారు. కొన్ని తోక పార్టీలు, కాంగ్రెసులోని కొందరు తోక నేతలు రాడికల్స్ చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న రాజ్యసభ సభ్యుడు కె కేశవరావుకు ఆయన సిడబ్లుసి మెంబరుగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

English summary
MLA Anam Vivekananda Reddy blamed Telangana leaders for students suicides. He accused that naxals in Telangana agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X