హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడగింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
హైదరాబాద్: మావోయిస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడగించింది. సిపిఐ (మావోయిస్టు), దాని ఆరు అనుబంధ సంఘాలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు విధించిన నిషేధం ఈ నెల 16వ తేదీతో ముగుస్తుంది. నిషేధానికి గురైన సిపిఐ (మావోయిస్టు) ఆరు అనుబంధ సంఘాలు - రాడికల్ యూత్ లీగ్, రైతు కూలీ సంఘం, రాడికల్ విద్యార్థి సంఘం, సంగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ కార్మిక సమాఖ్య, అఖిల భారత విప్లవ విద్యార్థి సమాఖ్య.

కాల్పుల విరమణ ప్రకటించి నక్సలైట్లతో శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వం 2004లో అప్పటి ప్రభుత్వం అప్పటి పీపుల్స్‌వార్‌పై, దాని అనుబంధ సంఘాలపై నిషేధం ఎత్తేసింది. చర్చల సందర్భంలో పీపుల్స్‌వార్ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసిసి)లో విలీనమై సిపిఐ (మావోయిస్టు)గా ఏర్పడింది.

స్వాతంత్ర్య దినోత్సవం నాడు కాంగ్రెసు శాసనసభ్యుడు సి. నర్సిరెడ్డి, మరో తొమ్మిది మందిని హత్య చేయడంతో ప్రభుత్వం సిపిఐ (మావోయిస్టు)పై, దాని అనుబంధ సంస్థలపై 2005 ఆగస్టు 17వ తేదీన ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ హత్యలతో తొమ్మిది నెలల కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు తెర పడింది.

English summary
The Andhra Pradesh government on Tuesday extended for another year the ban on the Communist Party of India (Maoist) and six of its frontal organisations, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X