వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగొచ్చిన కేంద్రం, 14ఎఫ్ తొలగింపునకు సిఫార్సు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణవాదుల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. 14ఎఫ్ తొలగింపునకు మరోసారి అసెంబ్లీ తీర్మానం కావాలని పట్టుబట్టిన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వెనక్కి తగ్గారు. హైదరాబాదును ఆరో జోన్‌ కిందికి తెచ్చే 14ఎఫ్‌ను తొలగిస్తూ రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతను కేంద్ర రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ సంఘం సమావేశమై 14ఎఫ్‌పై విస్తృతంగా చర్చించింది.

గతంలో చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని 14ఎఫ్‌ను తొలగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాశారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఉదయం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో ఫోనులో మాట్లాడారు. రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి 14ఎఫ్‌ను తొలగింపజేసే బాధ్యత తనదని, ఎస్సై రాత పరీక్షలు యథావిధిగా జరగనివ్వాలని ముఖ్యమంత్రి తెలంగాణవాదులతో అన్నారు. అయితే, దాన్ని తొలగించే వరకు తాము శాంతించేది లేదని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువడినప్పటికీ రేపటి తెలంగాణ బంద్‌ను వాయిదా వేసుకునే ప్రసక్తి లేదని ఒయు జెఎసి స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు తాము వెనక్కి తగ్గేది లేదని ఒయు జెఎసి నాయకులు చెప్పారు. ఒక్కసారి నమ్మి మోసపోయాం కాబట్టి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం వెలువరించే వరకు వెనక్కి తగ్గబోమని, రేపటి బంద్ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు.

English summary
Union government has decided to felite 14f to ficilitate Hyderabad sixth zone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X