జగన్ వర్గం ఎంపి సబ్బంపై తర్వాత మాట్లాడుతా: బొత్స
పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను రద్దు చేసినట్లు, తెలంగాణ సమస్య తేలిన తర్వాతనే ఆ కమిటీలను వేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులు విధులకు హాజరు కాకపోవడం వేరు, స్వాతంత్ర్య దినోత్సవాలకు హాజరు కావడం వేరని ఆయన అన్నారు. ఈ నెల 16వ తేదీన మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు తనకు అధికారిక సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులు సమ్మెను విరమించుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతున్నామని, ఈ స్థితిలో సానుకూల వాతావరణాన్ని కల్పించి, సమస్యను పరిష్కరించడానికి తోడ్పడాలని, ఇందుకు గాను ఉద్యోగులు సమ్మె నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. ఈ నెల 20వ తేదీన చిరంజీవి కాంగ్రెసు పార్టీలో చేరుతున్నందున తన తూర్పు గోదావరి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నట్లు ఆయన తెలిపారు.