వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఠాగూర్ రిపీట్స్: జగన్‌కు భయపడి శవానికి ట్రీట్‌మెంట్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

East Godavari
కాకినాడ: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి భయపడి ఓ శవానికి ట్రీట్‌మెంట్ చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగినట్లుగా బుధవారం ఉదయం వార్తలు వచ్చాయి. పంట విరామాన్ని ప్రకటించిన తూర్పు గోదావరి జిల్లా రైతులను పరామర్శించేందుకు జగన్ సోమ, మంగళవారాల్లో జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. జగన్ మొదటి రోజు పర్యటిస్తున్న సమయంలో జిల్లా కలెక్టర్‌కు తన ఇబ్బందులు చెప్పుకుందామని శ్రీనివాసరావు అనే కౌలు రైతు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శ్రీనివాస రావు ఆరు ఎకరాలను కౌలుకు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే కలెక్టర్‌ను కలిసే అవకాశం లేక పోవడంతో అతను కలెక్టరేట్ కార్యాలయం ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అక్కడే ఉన్న కలెక్టర్ మేలుకొని అతనిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మరణించినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో జగన్ పర్యటన ఉన్న నేపథ్యంలో మృతి రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందని భావించిన వైద్యులు అతని మృతదేహానికి ట్రీట్‌మెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. మంగళవారం జగన్ పర్యటన అయ్యాక వారు అతను మృతి చెందినట్లుగా ప్రకటించినట్లు తెలుస్తోంది. జగన్ పర్యటన కారణంగానే శవానికి ట్రీట్‌మెంట్ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.

English summary
Doctors make treatment to farmer dead body with the fear of YSR Congress party president YS Jaganmohan Reddy's tour in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X