మంత్రి పదవుల కోసం గాలి బ్రదర్స్ లాబీయింగ్

Gali Janardhan Reddy
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ కొలువులో మంత్రి పదవుల కోసం మైనింగ్ మాగ్నెట్స్ గాలి బ్రదర్స్ తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. గాలి బ్రదర్స్‌తో పాటు బిజెపి సీనియర్ నేత అనంతకుమార్ కూడా తనవారికి మంత్రి పదవులు ఇప్పించుకోవడానికి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. సదానంద గౌడ మంత్రివర్గంలో 12 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఈ వారంలో భర్తీ చేయాలని ఆయన అనుకుంటున్నారు.

అనంతకుమార్‌తో పాటు సీనియర్ బిజెపి నేత తమ అగ్రనేత ఎల్‌కె అద్వానీతో బుధవారం సమావేశమయ్యారు. కర్ణాటక వ్యవహారాలపై ఆయన మాట్లాడారు. తన అనుచరులకు కొంత మందికి సదానంద గౌడ మంత్రివర్గంలో చోటు దక్కేలా చూడాలని అనంత కుమార్ అద్వానీని కోరినట్లు సమాచారం. యడ్యూరప్ప కొలువులో పర్యాటక మంత్రిగా పనిచేసిన గాలి జనార్దన్ రెడ్డి కూడా ఢిల్లీలో మకాం వేశారు. తన అనుచరులకు మంత్రి పదవులు ఇప్పించుకోవడానికి ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

లోకాయుక్త నివేదికలో చోటు చేసుకోవడంతో గాలి జనార్దన్ రెడ్డికి, ఆయన సోదరుడు కరుణాకర్ రెడ్డి, వారి అనుచరుడు శ్రీరాములుకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. మంగళవారంనాటి నుంచి సదానంద గౌడ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన అద్వానీని, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌ను, రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీని కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+