హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తుల కేసులో నేడే హైకోర్టు తీర్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ ఆస్తులకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలంటూ మంత్రి శంకరరావు, టీడీపీ నేతలు, కడప న్యాయవాది హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లపై బుధవారం తీర్పు వెలువడనుంది. తండ్రి రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి జగన్‌ అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని పిటిషనర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇతరులకు లబ్ధి చేకూర్చడం ద్వారా దానికి ప్రతిఫలంగా జగన్‌ తన కంపెనీల్లోకి పెట్టుబడులు స్వీకరించారని శంకరరావు లేఖ రాయగా, తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కడప న్యాయవాది కె.కె.షేర్వాణిలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ, జస్టిస్‌ విలాస్‌ వి.అఫ్జల్‌పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం గత వారం ఇరుపక్షాల వాదనలను విని తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్‌లపై బుధవారం తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్లతో పాటు ఎమ్మార్‌ వ్యవహారాల్లో అవకతవకలపై శంకరరావు రాసిన లేఖను సుమోటో పిటిషన్‌గా విచారణ చేపట్టిన కేసులో కూడా తీర్పు వెలువరించనుంది.

English summary
High Court will deliver its decision today in YSR Congress party president YS Jagan's properties case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X