వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రం ఎలా అడుగుతారు?: మంత్రి టిజి వెంకటేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
న్యూఢిల్లీ: తమ ప్రాంతం వెనుకబడి ఉందని భావిస్తే తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజి అడగాలి కానీ ప్రత్యేక రాష్ట్రం ఎలా అడుగుతారని చిన్న నీటి తరహా పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం ప్రశ్నించారు. సాయంత్రం కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాదుతో భేటీ ఉన్న నేపథ్యంలో ఆయనతో చర్చించాల్సిన విషయాలపై మాట్లాడేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎంపీ కావూరి సాంబశివరావు ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, గల్లా అరుణ కుమారి, శైలజానాథ్, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, చీప్ విప్ కొండ్రు మురళి భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సీమాంధ్ర నేతలు మాట్లాడారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రజాప్రతినిధులు అనడం హస్యాస్పదంగా ఉందన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఆరేళ్ల పాటు పని చేసిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య నీటి కేటాయింపుల్లో అన్యాయం జరిగిందనడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి లేదనుకుంటే ప్యాకేజీ కోరాలని అన్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం కోరటం సబబు కాదన్నారు. కాగా కేంద్రం 14ఎఫ్ రద్దు చేయడంతో దానిపై సానుకూలంగా వెళ్లాలని వారు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధి కుంటుపడకూడదనే సదుద్దేశ్యంతోనే వారు దానిపై బెట్టు చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

English summary
Minister TG Venkatesh questioned Telanganites about seperate telangana. He suggested them to demand special package if they think Telangana is back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X