వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై హైకోర్టు తీర్పు చరిత్రలో నిలుస్తుంది: విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
న్యూఢిల్లీ/హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచి పోతుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు బుధవారం న్యూఢిల్లీలో ఓ ఛానల్‌తో అన్నారు. అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని ప్రజల డబ్బును అక్రమంగా దోచుకున్నారని విమర్శించారు. సిబిఐ విచారణ కక్ష్య సాధింపు చర్య కాదన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది. దమ్ముంటే జగన్ ఆస్తులపై విచారణ చేయించుకోవచ్చుననే జగన్, ఆయన పార్టీ నేతలే సవాళ్లు విసిరారరని ఇప్పుడు అవి ఏమైనాయని ప్రశ్నించారు. అప్పుడు సవాల్ విసిరి ఇప్పుడు కక్ష సాధింపు అని ఎలా అంటారని ప్రశ్నించారు.

ఇష్టం వచ్చినట్లు సంపాదిస్తే నిలవదని జగన్ ఆస్తులపై తీర్పు వల్ల తెలిసిందన్నారు. ఇది ప్రజా తీర్పు అని అన్నారు. ఇక నుండి ఎవరూ అవినీతికి పాల్పడకుండా సిబిఐ ఇలాగే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎవరు తవ్విన గోతిలో వారే పడతారనడానికి జగన్ ఆస్తుల వ్యవహారమే నిదర్శనమన్నారు. అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న వారికి జగన్ కేసు ఓ హెచ్చరిక అన్నారు. హైకోర్టు తీర్పుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు అని అన్నారు. మొదట నాయకులపై, ఆ తర్వాత పార్టీ అధిష్టానంపై కక్ష సాధింపు అన్న జగన్ ఇప్పుడు కోర్టును కక్ష సాధింపు అంటారా అని ప్రశ్నించారు.

కాగా ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సైతం ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో పూర్తిస్థాయి దర్యాఫ్తు చేపట్టాలని హైకోర్టు ఆదేశించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మార్ కేసులో తాను ఎప్పటి నుండో పోరాడుతున్నానని నా ప్రయత్నం ఫలించిందన్నారు. విచారణలో కక్ష సాధింపు లేదన్నారు. కక్ష సాధింపు అంటే గతంలో పరిటాల హత్య కేసులో జగన్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన తండ్రే సిబిఐ విచారణ జరిపించారని అది కక్ష సాధింపు కానప్పుడు ఇది ఎలా అవుతుందన్నారు. ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గానికి ఎమ్మార్ అక్రమాలతో ఏమాత్రం సంబంధం లేదన్నారు. నాయకులు తప్పు చేస్తే ఆస్తులను జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Congess party senior leader, MP V Hanumantha Rao welcomed High Court judgement on YSR Congress party president YS Jaganmohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X