వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తన ఆస్తుల కేసులో కేసులు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు జరపాలని సిబిఐ దర్యాప్తు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సుప్రీంకోర్టుకు వెళ్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, జగన్ తరఫు న్యాయవాదులు గానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గానీ దీనికి స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. తాము చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వైయస్ జగన్ వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి చెప్పారు.

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అత్యవసరంగా సమావేశమై పరిస్థితిపై సమీక్షించింది. జగన్ స్వస్థలం పులివెందులలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, తమ వాదన వీగిపోలేదని జగన్ తరఫు న్యాయవాది నాగేశ్వర రావు అన్నారు. తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పడానికి కూడా వీలు లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరపాలని మాత్రమే హైకోర్టు ఆదేశించిందని, అంత మాత్రాన జగన్‌పై మోపిన అభియోగాలు రుజువు అయ్యాయని కాదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్తారా, లేదా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

తన ఆస్తులపై ప్రాథమిక దర్యాప్తు జరపాలని ఇంతకు ముందు హైకోర్టు సిబిఐకి ఇచ్చిన అదేశాలను జగన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై సిబిఐ ప్రాథమిక దర్యాప్తును ఆపించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. అయితే, తాము ఈ స్థితిలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో సిబిఐ ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి హైకోర్టుకు నివేదిక సమర్పించింది.

English summary
It is not clear wether YS Jagan will challenge High Court judgement in Supreme Court or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X