జగన్ నిరపరాధిగా బయటకు వస్తారు: కొణతాల

Konathala Ramakrishna
హైదరాబాద్: సిబిఐ దర్యాప్తులో తమ పార్టీ నాయకుడు వైయస్ జగన్ నిరపరాధిగా బయట పడతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ అన్నారు. ఎటువంటి దర్యాప్తునకైనా తాము సిద్ధమైన ఆయన బుధవారం మీడియా ప్రతిధులతో అన్నారు. ప్రజలు అమాయకులు కారని, రాజకీయంగా ఎదుర్కోలేక జగన్‌ను సర్వనాశనం చేయాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు చూస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజల దీవెనలతో వాటిని ఎదుర్కుని స్వచ్ఛందంగా ముందుకు వస్తామని ఆయన అన్నారు.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి వైయస్ జగన్‌పై కుట్ర చేశాయని వైయస్ జగన్ వర్గానికి చెందిన ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. తాము ప్రజా కోర్టులో తేల్చుకుంటామని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్ నిజాయితీ దర్యాప్తు ద్వారా బయటపడుతుందని ఆమె అన్నారు.

ఎమ్మార్, జగన్ ఆస్తుల వ్యవహారంలో హైకోర్టు తీర్పు ముందుగా ఊహించిందేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. కాంగ్రెసు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచే జగన్‌పై వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె అన్నారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి కుట్రలు చేశాయని ఆమె విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+