ఏ ఆధారాలపై జగన్‌పై సిబిఐ విచారణ: కొండా సురేఖ

Konda Surekha
వరంగల్: ఏ ఆధారాలపై ఆధారపడి హైకోర్టు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించిందో తెలపాలని జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ డిమాండ్ చేశారు. జగన్ ఆస్తులపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడంపై ప్రజల్లో అనుమానాలున్నాయని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఆయన మంత్రివర్గంలోని సభ్యులు అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదని, ఎందుకు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదని ఆమె అడిగారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నందుకు కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ శాఖను మార్చారని, కేసు వేసినందుకు శాసనసభ్యుడు పి. శంకరరావుకు మంత్రి పదవి ఇచ్చారని ఆమె విమర్శించారు. వైయస్సార్ మృతికి దిగ్భ్రాంతికి గురై మరణించినవారి కుటుంబాలకు కాంగ్రెసు ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆమె గుర్తు చేశారు. వైయస్ జగన్ ఆస్తులపై తన వద్ద ఆధారాలున్నాయని అంటున్న మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వాటిని బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+