వైయస్ జగన్పై నారాయణ, తెలంగాణపై రాఘవులు

కాంగ్రెసు అధిష్టానం అవకాశవాద రాజకీయాలు చేస్తోందని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బొమ్మలా మార్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ అవినీతిపై ప్రజలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు విశ్వాసం కల్పిస్తూ క్రాప్ హాలిడేపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
తెలంగాణపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వైఖరి సరైంది కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్రంలోని అనిశ్చితికి స్వస్తి చెప్పాలని ఆయన శనివారం విశాఖపట్నంలో కోరారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చెబుతున్న చిదంబరం శ్రీకృష్ణ కమిటీని ఎందుకు వేశారని ఆయన అడిగారు. మన్యం గిరిజనులపై ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్సించారు. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications