వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టు తీర్పుపై రేపు సుప్రీంకోర్టుకు: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
హైదరాబాద్: తనను ఎన్ని వేధింపులకు గురి చేసినా దేవుడే చూసుకుంటాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తన ఆస్తులపై పూర్తి స్థాయి సిబిఐ విచారణ జరపాలని ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను రేపు మంగళవారం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఆయన చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరణ ఇచ్చారు. తనపై కేసులు వేసినప్పుడు సిబిఐని కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా అభివర్ణించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు తనపై సిబిఐ విచారణ ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

2జి స్కామ్‌లో మంత్రి వర్గ సభ్యుడు ఎ. రాజాను నిందితుడిగా నిలబెట్టి ప్రధాని తనకు ఏమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో మాత్రం మంత్రివర్గ నిర్ణయాలకు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని చూపిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసులో ఉన్నంత కాలం ఏ విధమైన ఆరోపణలు చేయలేదని, మరణించిన వ్యక్తిపై ఆరోపణలు చేస్తున్నారని, అది కూడా మరణించి రెండేళ్లయిన తర్వాత చేస్తున్నారని, తన తండ్రిపై బురద చల్లుతున్నారని ఆయన అన్నారు. ఎకరా భూమి కేటాయించినా అది మంత్రి వర్గ సమిష్టి నిర్ణయమేనని ఆయన అన్నారు. తన సంస్థలు భారతి, సాక్షి, పవర్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పారదర్శకంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆ సంస్థల్లో ఎవరెవరు ఎంతెంత పెట్టుబడులు పెట్టారనే విషయాలను కూడా ఆయన వెల్లడించారు. కర్ణాటకలోని తన పవర్ ప్రాజెక్టు తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికే పూర్తయిందని ఆయన అన్నారు.

భూకేటాయింపుల విషయంలో తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు అనుసరించిన విధానాన్నే వైయస్ రాజశేఖర రెడ్డి అనుసరించారని ఆయన చెప్పారు. చంద్రబాబు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ ఓడరేవులకు భూములు కేటాయించారని ఆయన చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ భూములు కూడా చంద్రబాబు హయాంలో కేటాయించినవేనని ఆయన చెప్పారు. చంద్రబాబు హయాంలో ఎన్నో స్కామ్‌లు, భూసంతర్పణలు జరిగాయని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో తాను బిజెపికి తప్ప మరెవరికీ వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. నాపై నమ్మకంతోనే తన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, వారికి లాభాలు కూడా పంచి ఇచ్చానని ఆయన అన్నారు. తన సాక్షి పత్రిక దేశంలోనే 9వ స్థానంలో ఉందని, ఆ అక్కసుతోనే ఈనాడు తనపై ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.

English summary
YSR Congress president YS Jagan said that he will challenge High Court order in Supreme Court on CBI probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X