వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలు తిరుగుబాటు చేస్తారు: చంద్రబాబు హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: అవినీతిని అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకోకుండా, దానిపై పోరాటం చేస్తున్నవారిని వేధించడం కొనసాగిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నా హజారే అరెస్టుకు నిరసనగా హైదరాబాదులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసిన అనంతరం ఆయన మంగళవారం సాయంత్రం మాట్లాడారు. అవినీతిని అరికట్టడానికి నిర్దిష్టమైన చట్టాలు తేవాలని, అవినీతిపరులను శిక్షించడానికి వీలు కల్పించే చట్టాలను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నా హజారేను అరెస్టు చేయడం అన్యాయమని ఆయన అన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యోగా గురు రామ్‌దేవ్ బాబాను ప్రభుత్వం వేధిస్తోందని ఆయన విమర్శించారు.

కాంగ్రెసు ప్రభుత్వం అవినీతిని సీరియస్‌గా తీసుకోవడం లేదని, ప్రధాని అవినీతికి సరెండరయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎమర్జెన్సీ వాతావరణం ఉందని ఆయన అన్నారు. గతంలో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జరిగిన పోరాటం కాంగ్రెసును చిత్తు చేసి, బంగాళాఖాతంలో పడేసిందని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. అవినీతి వల్ల రాజకీయ పార్టీలపై విశ్వాసం సన్నగిల్లుతోందని, రాజకీయ నాయకులమంతా విశ్వాసాన్ని పాదుకొల్పుకోవడానికి అవినీతిపై చర్యలు తీసుకోవడం అవసరమని ఆయన అన్నారు.

దేశం ప్రధాన సమస్య అవినీతి అని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు. లోక్‌పాల్ పరిధిలోకి ప్రధాన మంత్రిని, లోకాయుక్త పరిధుల్లోకి ముఖ్యమంత్రులను తేవాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Telugudesam president N Chandrababu Naidu warned Congress government on corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X