సిబిఐ సోదాలు, ఈనాడు రామోజీపై సాక్షి డైలీ ఫైర్

తాజా పరిణామాలు ఈటీవి - 2వారిలో, ఆ చానెల్ యజమాని రామోజీరావులో కొత్త ఉత్సాహం నింపినట్టున్నాయని, భారీ బహిరంగ సభలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయని ఈటీవీ2 సిబిఐ సోదాలు జరిగిన పలు చోట్ల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయడం ఇందుకు నిదర్శనమని సాక్షి డైలీ తన వార్తాకథనంలో వ్యాఖ్యానించింది. జగన్ను టార్గెట్ చేసుకుని గతంలో ఈటీవి2 ప్రసారం చేసిన వార్తాకథనాలను కూడా గుర్తు చేసింది. క్యాంటిన్కు చెందిన ఖాళీ గిన్నెలను కూడా కీలక డాక్యుమెంట్లుగా ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి వర్ణించిందని వ్యాఖ్యానించింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆ చానెల్ బురద చల్లుతూనే ఉన్నదని విమర్సించింది.
జర్నలిజంలో ఎవరూ వాడని పదాలను అలవోకగా వాడగలిగే సత్తా ఉన్న స్టూడియో - ఎన్ ఉచ్చు బిగిసిందంటూ కథనాలు ప్రసారం చేసిందని, ఏ పదానికి ఏ అర్థమో కూడా తెలియని ఈ చంద్రబాబు చానెల్ గురువారం ఉదయం నుంచి జగన్పై బురద చల్లడంలో నిమగ్నమైందని సాక్షి విమర్సించింది.












Click it and Unblock the Notifications