జగన్ కుట్రలో పాలుపంచుకోవద్దు: ఎమ్మెల్యేలకు బొత్స

జగన్ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. వ్యోక్స్ వ్యాగన్ కేసులో తనను సైతం సిబిఐ విచారించిందని, అయితే చివరకు ఆ కేసుతో నాకు సంబంధం లేదని తేల్చిందని అన్నారు. ప్రజాధరణ ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టు ఆరోపణలు వస్తే విచారణ జరపకూడదా అని ప్రశ్నించారు. సిబిఐ సోదాల నుండి జగన్ కుటుంబం తప్పించుకోవాలని చూస్తుందని అన్నారు. జగన్ సిబిఐని ఎదుర్కోలేక పోతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో జగన్ కుట్రలకు బలికావద్దని ఆయన జగన్ వర్గం ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజలు కాంగ్రెసును నమ్మి ఓటేశారు. ఇప్పుడు పక్కదారి పట్టకండని సూచించారు. రాజీనామాలు చేసినా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదన్నారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే సిబిఐ పూర్తిస్థాయి దర్యాఫ్తు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications