వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటికో మనిషి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఇంటికో మనిషి ఉద్యమంలో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం పిలుపునిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అన్నాహజారే దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. అవినీతిరహిత సమాజం రావాల్సి ఉందని ఆయన అన్నారు. బలమైన లోక్‌పాల్ బిల్లు కోసం జరుగుతున్న ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరారు.

నల్లధనాన్ని బయటకు తీసి దేశంలోని పిల్లల చదువుకు, పేదల ఖర్చుకు వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలన కోసం యువత ముందుండాలన్నారు. అవినీతి నిర్మూలించడానికి కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఇంటికో మనిషి ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. గ్రామగ్రామానికి ఉద్యమాన్ని తీసుకు వెళ్లాలన్నారు. తాజా పరిస్థితి చూస్తుంటే ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితిని గుర్తుకు తెస్తోందని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారిని అడ్డుకోవడం సరికాదన్నారు.

English summary
Telugudesam party rallied to support Anna Hazare deeksha today. TDP rallied from NTR Trust Bhavan. Party chief Chandrababu Naidu started rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X