హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పటికి అసెంబ్లీలో చిరంజీవి పిఆర్పీ నేతనే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియ పూర్తయినప్పటికీ అసెంబ్లీలో మాత్రం అది పూర్తి కాలేదు. ప్రజారాజ్యం పార్టీ అధికారికంగా కాంగ్రెసులో విలీనమైంది. కానీ ఇప్పటి వరకు అసెంబ్లీ దృష్టికి విలీన ప్రక్రియ అంశం రానందున అక్కడ ప్రజారాజ్యంను ఇంకా ప్రత్యేక పార్టీగానే పరిగణిస్తారు. అసెంబ్లీ దృష్టిలో ఇప్పటికీ చిరంజీవే ప్రజారాజ్యం పార్టీ శాసనసభా పక్ష నాయకుడే. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్న శోభానాగిరెడ్డితో సహా సోమవారం కాంగ్రెసు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలంతా పిఆర్పీ ఎమ్మెల్యేలుగానే అసెంబ్లీ పరిగణిస్తుంది. అప్పటి వరకు వారికి అసెంబ్లీలో పీఆర్పీకి కేటాయించిన సీట్లే ఉంటాయి.

అసెంబ్లీలో సైతం విలీన ప్రక్రియ పూర్తి కావాలంటే పిఆర్పీ శాసనసభా పక్షం సమావేశం అయి విలీనం పూర్తి చేసుకున్న తమను కాంగ్రెసు ప్రజా ప్రతినిధులుగా గుర్తించాలంటూ తీర్మానాన్ని ఆమోదించి దానిని స్పీకర్‌కు సమర్పించారు. ఆ తర్వాత స్పీకర్ కార్యాలయం వారిని కాంగ్రెసు సభ్యులుగా గుర్తించి సభలో సీట్లు కేటాయిస్తుంది. తీర్మానం సమయంలో విలీనం ఇష్టం లేదని ఎవరైనా చెబితే వారని స్వతంత్ర్య సభ్యులుగా గుర్తిస్తారు. విలీనం తనకు ఇష్టం లేదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ఇప్పటికే స్పీకరుకు లేఖ రాసిన నేపథ్యంలో ఆమెను స్వతంత్ర సభ్యురాలుగా గుర్తిస్తూ సీటు కేటాయిస్తారు.

English summary
Chiranjeevi is PRP president in Assembly till PRP MLAs resolution will sent to speaker Nadendla Manohar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X