హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌పై రామోజీరావు ఈనాడు వార్ తీవ్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రామోజీరావుకు చెందిన ఈనాడు దినపత్రిక తన వార్‌ను తీవ్రం చేసింది. జగన్ వర్గంపై ఈనాడు మంగళవారం రెండు వార్తాకథనాలను ప్రచురించింది. అందులో ఒకటి జగన్ వర్గం శాసనసభ్యులకు డబ్బులతో ఎర వేస్తోందని, తమ వైపు వచ్చే ఒక్కో ఎమ్మెల్యేకు పది కోట్ల రూపాయల దాకా ఇచ్చి, ఎన్నికల ఖర్చు కూడా భరిస్తామని హామీ ఇస్తుందని కాంగ్రెసు విమర్సిస్తున్నట్లు ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. జగన్ వర్గం హైకోర్టు ఆదేశాలపైనా అక్కసు అంటూ మరో వార్తాకథనాన్ని ప్రచురించింది. సాక్షాత్తూ రాజ్యాంగ సంస్థ అయిన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పుడు భాష్యాలు చెప్పేందుకు ప్రయత్నిస్తోందంటూ విమర్సించింది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వైయస్ సెంటిమెంటు పండలేదని, యువ ఎమ్మెల్యేలు పలకడం లేదని రాసింది. కాంగ్రెసు నుంచి కనీస సంఖ్యలో ఎమ్మెల్యేలను లాగలేకపోయిన వైయస్సార్ కాంగ్రెసు చివరికి ఒక్కో ఎమ్మెల్యే మీద పది కోట్లకు పైగా రూపాయలు కుమ్మరించేందుకు సిద్ధపడిందని కాంగ్రెసు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయని ఈనాడు రాసింది. గతంలో తమతో సన్నిహితంగా మెలిగినవారిపై రెండు, మూడు రోజులుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు దృష్టి పెట్టాయని రాసింది. అయితే, డబ్బులతో ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణల్ని ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన జగన్ వర్గం నేతలు శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఖండించినట్లు కూడా ఈనాడు దిపత్రిక రాసింది. కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, రంగారెడ్డి తదితర జిల్లాలోని కొందరు శాసనసభ్యులతో జగన్ వర్గం నేతలు మాట్లాడినట్లు రాసింది.

English summary
Ramoji Rao's Eenadu intensified its political war against YSR Congress party president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X