హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం, బాబు జిల్లాలో ఎమ్మెల్యేలు జగన్‌వైపు జంప్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు నుండి మరో ముగ్గురు శాసనసభ్యులు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్సీ పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. కిరణ్ కుమార్ రెడ్డికి బద్ద శత్రువు అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కిరణ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పెద్దిరెడ్డి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. కిరణ్‌ను ఆ పదవి నుండి దింపే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. తాను కాంగ్రెసులో ఉంటూనే కిరణ్‌ను దింపే ప్రయత్నాలు చేస్తానని చెప్పుకొచ్చారు.

అయితే ఇటీవలి కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైలెంట్ అయిపోయిట్టుగా కనిపిస్తోంది. దీంతో పలువురు ఆయన జగన్ వర్గంలో చేరేందుకు నిర్ణయించుకోవడం వల్లనే సైలెంట్ అయినట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసులో ఉండటం కంటే జగన్ వర్గంలో చేరడమే ఉత్తమమైనదిగా ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు, టిడిపిల కంటే జగన్ హావానే నడుస్తుందని ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా, 2014 ఎన్నికలు జరిగినా జగన్‌తో ఉండే వారికే ఫ్యూజర్ ఉంటుందనే భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే షాజహాన్ సైతం పెద్దిరెడ్డి బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరితో పాటు మరో ఎమ్మెల్యే కూడా జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం.

English summary
Three mlas may jump in ysrc party from chittoor district which is CM Kiran Kumar Reddy's and TDP chief Chandrababu Naidu's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X