వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మనాభ స్వామి ఆలయంపై వియస్ సంచలన ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

Padmanabhaswamy Temple
తిరువనంతపురం: శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం సంపదపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వియస్ అచ్యుతానందన్ సంచలన ప్రకటన చేశారు. రాచకుటుంబం సంపదను కొంత తరలించినట్లు ప్రకటించిన ఆయన అంశం సున్నితత్వాన్ని గ్రహించి దాన్ని తేలికపరిచే పనిచేశారు. ఆ అభిప్రాయం తన సొంతం కాదని, తనకు అందిన ఫిర్యాదు మేరకు ఆ ప్రకటన చేశానని ఆయన చెప్పారు.

పద్మనాభస్వామి ఆలయంలో దోపిడీకి జరిగిన ప్రయత్నంపై తనకు అందిన ఫిర్యాదుతో సుప్రీంకోర్టుకు వెళ్తానని ఆయన చెప్పారు. ఒక ప్రత్యేకమైన దోపిడీ యత్నం గురించి మాత్రమే తాను మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. మాజీ సైనికోద్యోగులైన భద్రతాధికారులు తనకు దోపిడీ యత్నం గురించి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అకారణంగా వారి ఉద్యోగాలు పోయాయని, బహుశా దాన్ని బయటపెట్టినందు వల్లనే అలా జరిగి ఉంటుందని ఆయన అన్నారు.

అచ్యుతానందన్ ప్రకటనతో పద్మనాభస్వామి ఆలయ సంపదపై కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ ప్రకటన అచ్యుతానందన్ స్థాయికి తగింది కాదని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అన్నారు.

English summary
After former Chief Minister and now Opposition leader VS Achuthanandan managed to make some explosive statements on the massive treasure trove being siphoned off by the royal family, he had to face some brickbats of the highest order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X