వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా హజారే విజయం: రేపు నిరాహార దీక్ష విరమణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: జన్‌లోక్‌పాల్‌ బిల్లు కోసం అన్నాహజారే చేసిన మూడు డిమాండ్లను లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కిందిస్థాయి ఉద్యోగులనూ లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురావాలని సభ తీర్మానించింది. ఈ మేరకు తీర్మానాన్ని స్థాయీ సంఘానికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ లోక్‌పాల్‌పై చర్చ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. సభ సమ్మతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త ఏర్పాటు చేస్తామని ప్రణబ్‌ చెప్పారు. ఓటింగ్‌ లేకుండా సభ సోమవారానికి వాయిదా పడింది.

లోకసభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ కూడా తీర్మానాన్ని ఆమోదించింది. లోక్‌రపాల్ తీర్మానం ఆమోదాన్ని తాము ఆహ్వానిస్తున్నట్లు టీమ్ అన్నా సభ్యురాలు కిరణ్ బేడీ చెప్పారు. కేంద్రంలో పటిష్టమైన లోక్‌పాల్‌ను, రాష్ట్రాల్లో లోకాయుక్తలను ఏర్పాటు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులను లోక్‌పాల్, లోకాయుక్తల పరిధిల్లోకి తెస్తారు. టైమ్‌లైన్‌తో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్స్ చార్టర్స్ ఉంటాయి.

అన్నా హజారేకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ లేఖ కూడా రాశారు. తీర్మానం ఆమోదం తర్వాత అన్నా హజారే రామ్‌లీలా మైదానంలో తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తాము సగం విజయం మాత్రమే సాధించామని, ఇది ప్రజా విజయమని ఆయన అన్నారు. గత 12 రోజులుగా దీక్ష చేస్తున్న అన్నా హజారే రేపు ఆదివారం ఉదయం పది గంటలకు విరమిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X