వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ మా నేత, జగన్ వర్గమే భ్రష్టు పట్టిస్తోంది: బొత్స
వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల రాజీనామాలు ఆమోదిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గానికి ఓట్లేస్తే అవినీతికి తలుపులు బార్లా తెరిచినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రలోభాల వల్ల, ఇతరత్రా కారణాల వల్ల జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ కేసులో కౌంటర్ వేయాలని సలహా ఇవ్వడానికి ఆ పనేదో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేస్తే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.
త్వరలో మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని ఆయన చెప్పారు. కొన్ని ఇబ్బందుల వల్ల ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మంత్రుల శాఖల మార్పుపై దృష్టి సారించలేకపోయారని ఆయన అన్నారు. ప్రభుత్వం, పార్టీ కలిసి పనిచేస్తూ ముందుకు సాగుతాయని ఆయన అన్నారు. కార్యకర్తల్లో విశ్వాసం పెంచడానికే తాను జిల్లా పర్యటనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
botsa satyanarayana ys jagan ys rajasekhar reddy Kakinada బొత్స సత్యనారాయణ వైయస్ జగన్ వైయస్ రాజశేఖర రెడ్డి కాకినాడ
English summary
PCC President Botsa Satyanarayana claimed that YS Rajasekhar Reddy is Congress leader.
Story first published: Saturday, August 27, 2011, 15:07 [IST]