తెలంగాణ అంశాన్ని కేంద్రం తేలుస్తుంది: ముఖ్యమంత్రి

Kiran Kumar Reddy
మహబూబ్‌నగర్‌: తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు, మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వం తేలుస్తుందని, అంత వరకు వేచి చూద్దామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోగా అభివృద్ధిపై దృష్టి పెడదామని ఆయన తెలంగాణవాదులకు సూచించారు. ఈలోగా అభివృద్ధి కుంటుపడే విధంగా, యువత తప్పుదారి పట్టేలా వ్యవహరించడం సరి కాదని, ఒక్కసారి వచ్చిన అవకాశం తిరిగి రాకపోవచ్చునని, ఆ అవకాశాలను జారవిడుచుకోవద్దని ఆయన సూచించారు. తెలంగాణ సమస్య యాభై ఏళ్లుగా ఉందని ఆయన అన్నారు.

యువతకు తమ ప్రభుత్వ హయాంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, వాటిని ఎలా కల్పిస్తారని అడుగుతున్నారని, అయితే ఆ అంచనాలు హేతుబద్దంగానే జరిగాయని ఆయన అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ప్రకటించనంత బడ్జెట్ విద్యార్థులకు మన రాష్ట్రంలో కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. విద్యార్థులు తమకు ఇష్టమైన చదువులే చదవాలని ఆయన సూచించారు. ఈ ఏడాది 27 లక్షల మందికి ఉపకార వేతనాలు చెల్లించినట్లు ఆయన తెలిపారు.

కాగా, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణవాదులు ఆందోళనకు దిగే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణవాదులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి సభలో మంత్రి డికె అరుణ పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+