Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దీక్ష విరమించండి: అన్నా హజారేకు ప్రణబ్ వినతి

Pranab Mukherjee
న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లుపై చర్చను ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శనివారం లోకసభలో ప్రారంభించారు. దీక్ష విరమించాలని ఆయన సామాజిక కార్యకర్త అన్నా హజారేకు విజ్ఞప్తి చేశారు. శనివారంనాటికి అన్నా దీక్ష 12వ రోజుకు చేరుకుంది. కాగా, అన్నా హజారే రక్తపోటు పడిపోయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన ప్రకటనలో వైద్యులు వెల్లడించారు. గత రాత్రి కంటే అన్నా హజారే ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. హజారే మరింత బరువు తగ్గినట్లు చెప్పారు.అయితే, మరో మూడు నాలుగు రోజుల వరకు తనకేం కాదని అన్నా హజారే అన్నారు. జన్‌లోక్‌పాల్‌ వచ్చే వరకూ తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.

లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంటు లోపలా, వెలుపలా చర్చ జరుగుతోందని ప్రణబ్ ముఖర్జీ లోకసభలో అన్నారు. అఖిల పక్ష సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. మొత్తం 40 అంశాల్లో 20 అంశాలపై ఒప్పందం కుదిరినట్లు ఆయన తెలిపారు. కీలకమైన ఆరు అంశాలపై భేదాభిప్రాయాలున్నాయని ఆయన చెప్పారు. లోక్‌పాల్ బిల్లుపై అభిప్రాయాలు తెలియజేయాలని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. అన్నా హజారే డిమాండ్లను కూడా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. పార్లమెంటు అధికారాలు దెబ్బ తినకుండా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దీక్ష విరమించాలని ప్రతిపక్ష నాయకుడు ఎల్‌కె అద్వానీ కూడా అన్నా హజారేకు విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+