కిరణ్‌కు 270 మంది ఎమ్మెల్యేల మద్దతు: అంబటి

Ambati Rambabu
గుంటూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై వైయస్సార్సీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కిరణ్ లాంటి నీచమైన ముఖ్యమంత్రి ఎవరూ ఉండరన్నారు. సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు లేదని అవాస్తవాలు పలుకుతున్నారన్నారు. కిరణ్‌కు ఆయన అన్నట్లుగా కేవలం 183 మంది సభ్యుల మద్దతు మాత్రమే లేదని 270 సభ్యులకు పైగా మద్దతుందన్నారు. అదంతా వైయస్ దయాదాక్షిణ్యాలపై గెలిచిన కాంగ్రెసు వారి మద్దతే కాకుండా తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మద్దతన్నారు.

అధికార దాహం గురించి బొత్స మాట్లాడటం విడ్డూరమన్నారు. పిసిసి అధ్యక్ష పదవి చేపట్టాక సైతం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఉండటం అధికార దాహం కాదా అని ప్రశ్నించారు. బొత్స కుటుంబంలో ఆయన సతీమణి బొత్స ఝాన్సీ పార్లమెంటు సభ్యురాలు అయితే, తమ్ముడు, మేనల్లుడు శాసనసభ్యులుగా ఉన్నారన్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా పదవిని చేపట్టిన తర్వాత డి శ్రీనివాస్ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి బొత్సకు గుర్తు లేదా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+