హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఉద్యమాలు చేయక్కరలేదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పైన ఒత్తిడి తెస్తేనే తెలంగాణ తెస్తేనే తెలంగాణ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రజా సంఘాలు బుధవారం స్పష్టం చేశాయి. ఈ నెల 3వ తారీఖున జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మంత్రి జానారెడ్డిని కలిసి వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పటికీ కాంగ్రెసు అధిష్టానంపై ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తే చాలన్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు.

భేటీకి జానారెడ్డిని ఆహ్వానించామని చెప్పారు. ఆయన వస్తానని చెప్పారన్నారు. 1969 నుండి కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉందన్నారు. తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెసు పార్టీ కార్యాచరణ స్పష్టం చేయాలని కోరినట్టు చెప్పారు. కాగా తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన వైఖరి రాకుంటే అందరూ రాజీనామాలకు సిద్ధపడాలన్నారు.

English summary
Gajjela Kantham said today there is no need of Congress mlas agitation for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X