వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసులకు భయపడేది లేదు, ఎదుర్కుంటాను: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వర్గం శాసనసభ్యులకు ధైర్యం నూరిపోశారు. కేసులకు భయపడేది లేదని, తాను ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కుంటానని ఆయన శాసనసభ్యులకు చెప్పారు. బుధవారం సాయంత్రం ఆయన తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశమయ్యారు. రాజీనామాలు చేయడం వల్ల మీ ఇమేజ్ పెరిగిందని వారికి చెప్పారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ప్రభుత్వం దానంతటదే పడిపోతుందని ఆయన ఆయన వారికి చెప్పారు.

సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని, ప్రజలు మనవైపే ఉన్నారని ఆయన శాసనసభ్యులతో అన్నారు. కాంగ్రెసు మైండ్ గేమ్‌లో పడొద్దని ఆయన శాసనసభ్యులకు సూచించారు. సెప్టెంబర్ 5వ తేదీన మళ్లీ వైయస్ జగన్ తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశం కానున్నారు. రాజీనామాలు చేసిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు సెప్టెంబర్ 6వ తేదీన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరుతారు. అవసరమైతే గవర్నర్‌ను కూడా కలుస్తారు. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన తన వర్గం శాసనసభ్యులకు సూచించారు.

కాగా, తమ వైపు మరింత మంది శాసనసభ్యులు వస్తారని జగన్‌తో సమావేశానంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాజీనామాల సంఖ్య పెరుగుతుందని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 5వ తేదీన జరిగే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X