కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: జగన్ వర్గం కొణతాల
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు సిబిఐ ఎఫ్ఐఆర్లో లేదంటున్న ముఖ్యమంత్రి మరోసారి ఎఫ్ఐఆర్ను చూడాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో లేదనడం హాస్యాస్పదం అని ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి వేరుగా అన్నారు. కాంగ్రెసు పెద్దలు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కేసులో కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వచ్చివ వైయస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో పేర్కొనడంపై కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు.
వైయస్ సంక్షేమ పథకాలను నీరుగార్చుతున్న కాంగ్రెసుకు వైయస్సార్ వర్ధంతిని నిర్వహించే అర్హత ఉందా అని ఆమె ప్రశ్నించారు. కాగా అంతకుముందు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి రాజీనామా చేసిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు వచ్చారు.